Header Banner

వేటు మొదలైంది! ఆ ఇద్దరి కథ కంచికే.. ఆందోళనలో వారు కూడా!

  Wed May 07, 2025 11:28        Others

జిల్లా వైద్యారోగ్యశాఖలో ముఖహాజరును ఐఫోన్‌ ద్వారా ట్యాంపరింగ్‌ చేసిన కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించాలని ఆశాఖ డైరెక్టర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 4న ‘ముఖహాజరు మాయా జాలం.. విధులకు ఎగనామం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో వైద్యశాఖలో అలజడి రేగింది.


అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం వైద్యులు, సిబ్బంది ముఖ హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేసేవిధంగా చర్యలు తీసుకుంది. అయితే ప్రభుత్వం సాధారణ ఫోన్లకు యాప్‌ను రూపొందించగా జిల్లాలోని 16 మంది మెడికల్‌ ఆఫీసర్లు ఆ యాప్‌ను ఐఫోన్ల ద్వారా ట్యాంపరింగ్‌ చేశారు. వారు పనిచేసే చోట ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయకపోయినా అక్కడే వేసినట్లు చూపించింది. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో కాంట్రాక్టు కింద ఇరువురు మెడికల్‌ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఐఫోన్‌ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ట్యాంపరింగ్‌ చేయడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారిని తొలగించాలని డీఎంహెచ్‌వోను హెల్త్‌ డైరెక్టర్‌ ఆదేశించారు.

 

200 మంది ఉద్యోగులు కూడా..

మరోవైపు వైద్యశాఖలో సుమారు 200 మంది వరకు రెగ్యులర్‌ ఉద్యోగులు ఫోన్‌ ట్యాంపరింగ్‌ ద్వారా హాజరుతోపాటు విధులకు ఆలస్యంగా వెళ్తున్నట్లు గుర్తించారు. వారిలో కొందరు పనిచేసే వైద్యశాల వద్దకు వెళ్లి ముఖ హాజరు వేసి లోపల అడుగు పెట్టకుండానే తిరిగి సాయంత్రం ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేస్తున్నట్లు కూడా పసిగట్టారు. వారందరికీ సీసీఎల్‌ఏ రూల్‌ ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని డైరెక్టర్‌ ఆదేశించారు. దీంతో ఉద్యోగుల్లో అలజడి రేగింది. ఇప్పటివరకు ఇష్టానుసారంగా వ్యవహరించిన వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెగ్యులర్‌ వారిని కేవలం సంజాయిషీ నోటీసులతో వదిలేస్తారా? కఠిన చర్యలు తీసుకుంటారా? అన్న ఆందోళన వారిలో నెలకొంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #FRSTampering #HealthcareScam #MedicalFraud #iPhoneTampering #HealthDeptScandal